యాక్షన్ కింగ్ అర్జున్ గారి నుంచి ఒక కొత్త చిత్రం రాబోతోంది. ఆయన నటించటమే కాకుండా ఈసారి రచనా, దర్శకత్వం, పోరాట సన్నివేశాల పర్యవేక్షణ కూడా చేసారు. నిరంజన్ హీరో గా, ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ని పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రమే “సీతా పయనం”. ఇది ఒక ప్రేమ కథ. ఎప్పుడూ పోరాట సన్నివేశాలు కుప్పలుగా ఉండే అర్జున్ గారి చిత్రాల పరంపరలో ఒక ప్రేమ చిత్రం రావటం చాలా ఆశ్యర్యానికి గురిచేసింది ప్రేక్షకులని. ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు నిర్మస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. సాయి మాధవ్ బుర్రా మాటలు సమకూర్చారు. ఈ చిత్రం నుంచి ఒక అందమైన టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ ని లాంచ్ చెయ్యటానికి విచ్చేసింది విలక్షణ నటుడు ఉపేంద్ర, మన దర్శక మాస్టారు సుకుమార్ గారు. ఈ టీజర్ గురించి ఈ రివ్యూ లో తెలుసుకుందాం.

హీరో, హీరోయిన్ ఒక కార్ ప్రయాణంలో కలుసుకుంటారు. అనుకోకుండా పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. అనుకోని సంఘటల నడుమ మనస్పర్థలు, అపార్థాలతో కొంత విరహం ఏర్పడినప్పటికీ, వాళ్ళ ప్రేమని ఎలా గెలుచుకున్నారు అనేది సారాంశంగా చూపించారు దర్శకులు. టీజర్ ఓపెనింగ్ నుంచి మంచి లవ్ మూడ్ తో మొదలుపెట్టి, నెమ్మదిగా యాక్షన్ ధోరణిలోకి తీసుకువెళ్లారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సత్యరాజ్, బిత్తిరి సత్తి, కోవై సరళ గారు ముఖ్య పాత్రలు పోషించారు. ధృవ్ సర్జ అతిధి పాత్రలో మెరుస్తారు. అనూప్ ఇచ్చిన సంగీతం వింటుంటే చాలా కాలం తరువాత ఆయన నుంచి మంచి మెలోడీ పాటలు వచ్చేలా ఉన్నాయి. ఆయన అందించిన ప్రేమ పాటలకి ఒక సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా. అర్జున్ గారి డైరెక్షన్లో కొంత మార్పు కనిపించింది, ఆయన ఇదివరకు చిత్రంతో పోలిస్తే. నిరంజన్, ఐశ్వర్య మంచి నటనా సామర్ధ్యాన్ని చూపించే ప్రయత్నం చేసారు.

ఈవెంట్ కి విచ్చేసిన ఉపేంద్ర గారు, సుకుమార్ గారు అర్జున్ గారి మీద తమకున్న అభిమానాన్ని మనస్ఫూర్తిగా వ్యక్తపరిచారు. ఉపేంద్ర గారు తనదైన స్టైల్ లో దేవుడు అనే పదానికి అర్థం చెప్పారు, అర్జున్ గారు ఏ విధంగా కరాటే మెళకువలని ఇండస్ట్రీ కి పరిచయం చేసారో గుర్తుచేసుకున్నారు. సుకుమార్ గారు కూడా తనదైన విధానంలో అర్జున్ గారిని, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ చిత్రంలో పనిచేయటం చాలా ఆనందంగా ఉందని తన అవధుల్లేని సంతోషాన్ని వ్యక్తపరిచారు నటుడు బిత్తిరి సత్తి. ఈ చిత్రానికి సంబందించిన మిగిలిన వివరాలు వెలువడేవరుకు మనం వేచిచూడాల్సిందే.